అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Police Prajavani | బాధితులు నిర్భయంగా పోలీస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 35 ఫిర్యాదులు స్వీకరించారు.
Police Prajavani | వివిధ ప్రాంతాల నుంచి..
ఈ సందర్భంగా సీపీ కార్యాలయంలో (CP Office) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సీపీ బాధితులతో స్వయంగా మాట్లాడారు. బాధితుల నుంచి వారి సమస్యలు తెలుసుకుని చట్టపరంగా తీసుకునే చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్స్టేషన్ల సీఐ, ఎస్సైలకు సమాచారం అందించారు.
Police Prajavani | మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా..
సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా సీపీ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. మూడోవ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ (District Police Department) పని చేస్తుందని సీపీ తెలిపారు.