అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | ఫేక్ కరెన్సీ నోట్ల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరికొందరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్ చంద్ర (SP Rajesh Chandra) వివరాలు వెల్లడించారు.
అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ నోట్ల తయారీ కేసులో పోలీసులు గతంతో ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్రలో గాలింపు చేపట్టిన 8 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇందులో ప్రధాన నిందితుడు కరెన్సీ కాట్నీపై ఇటీవల పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. ముఠాలోని మరొక ముగ్గురిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరి నుంచి రూ.1.70 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
