DMHO Rajashri | ప్రతి రోగి వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేయాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DMHO Rajashri | ప్రతి రోగి వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేయాలని డీఎంహెచ్​వో రాజశ్రీ (DMHO Rajashri) పేర్కొన్నారు. జిల్లాలోని ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సూపర్​వైజర్లు, ఇతర వైద్య సిబ్బందితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పీహెచ్​సీలో రోగుల వివరాలు ఆన్​లైన్​లో (patient details online) నమోదు చేయాలన్నారు. అలాగే ఫార్మసీలో మందుల వివరాలను సైతం ఏరోజుకారోజు ఎంట్రీ చేయాలని సూచించారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DMHO Rajashri | ప్రతి రోగి వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేయాలని డీఎంహెచ్​వో రాజశ్రీ (DMHO Rajashri) పేర్కొన్నారు. జిల్లాలోని ఉప వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సూపర్​వైజర్లు, ఇతర వైద్య సిబ్బందితో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పీహెచ్​సీలో రోగుల వివరాలు ఆన్​లైన్​లో (patient details online) నమోదు చేయాలన్నారు. అలాగే ఫార్మసీలో మందుల వివరాలను సైతం ఏరోజుకారోజు ఎంట్రీ చేయాలని సూచించారు. గర్భిణులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. గర్భిణుల ఆరోగ్య పరీక్షల నమోదులో అలసత్వం వహించే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలపై (ANMs and ASHA workers) చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఆశ కార్యకర్త తమ పరిధిలో అర్హులైన మహిళలకు అనారోగ్య సమస్యలుంటే వెంటనే పీహెచ్​సీకి వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాలను పకడ్బందీగా నిర్వహిస్తూ 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్​ ప్రోగ్రాం అధికారి శ్వేత, డీఎంవో డాక్టర్ వెంకటేష్, డీఎస్​వో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.