Yellareddy | ప్రతిమండలంలో చేపల మార్కెట్​ ఏర్పాటుకు కృషి: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ప్రతిమండలంలో మత్స్య మార్కెట్​ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్​ మోహన్ (MLA Madan Mohan) పేర్కొన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో వందశాతం రాయితీతో చేపల పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రంలో వెయ్యి గజాలు ప్రభుత్వ స్థలాన్ని చేపల మార్కెట్ కోసం కేటాయించాలని కలెక్టర్​ను కోరినట్లు తెలిపారు. తద్వారా చేపల అమ్మకం సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డి మండలంలో […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ప్రతిమండలంలో మత్స్య మార్కెట్​ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్​ మోహన్ (MLA Madan Mohan) పేర్కొన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో వందశాతం రాయితీతో చేపల పిల్లలను విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండల కేంద్రంలో వెయ్యి గజాలు ప్రభుత్వ స్థలాన్ని చేపల మార్కెట్ కోసం కేటాయించాలని కలెక్టర్​ను కోరినట్లు తెలిపారు. తద్వారా చేపల అమ్మకం సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డి మండలంలో (Yellareddy Mandal) మార్కెట్ యార్డు ప్రారంభమైందన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. లింగంపేట్ మండలంలో కూడా చేపల మార్కెట్ యార్డు కోసం భూమిని గుర్తించినట్లు చెప్పారు. అన్ని మండల ప్రధాన కేంద్రాల్లో ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.