అక్షరటుడే, నిజాంసాగర్: PRTU : కామారెడ్డి జిల్లా Kamareddy district మహమ్మద్ నగర్ లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల Zilla Parishad High School (కాంప్లెక్స్ పాఠశాల) కు పీఆర్టీయూ నాయకులు విరాళం అందజేశారు. పాఠశాలలో కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలు కోసం పీఆర్టీయూ మహమ్మద్ నగర్ మండల అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి రూ.10,000 విరాళాన్ని సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రాజుకు అందించారు. కార్యక్రమంలో PRTU సంఘ బాధ్యులు వెంకటరమణ, పండరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
