CP Sai chaitanya | కందకుర్తి వద్ద గోదావరిని పరిశీలించిన సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, బోధన్​: CP Sai chaitanya | మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) గోదావరిలోకి ఉధృతంగా వరద వస్తోంది. దీంతో జిల్లాలోని కందకుర్తి (Kandakurthi), తదితర పుష్కర ఘాట్ల (Pushkara Ghats) వద్ద వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) సోమవారం ఆయా పుష్కరఘాట్లను పర్యవేక్షించారు. బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలంలోని (Renjal Mandal) కందకుర్తి గ్రామ సమీపంలో కందకుర్తి గోదావరి వంతెనను సీపీ […]

అక్షరటుడే, బోధన్​: CP Sai chaitanya | మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) గోదావరిలోకి ఉధృతంగా వరద వస్తోంది. దీంతో జిల్లాలోని కందకుర్తి (Kandakurthi), తదితర పుష్కర ఘాట్ల (Pushkara Ghats) వద్ద వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) సోమవారం ఆయా పుష్కరఘాట్లను పర్యవేక్షించారు.

బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలంలోని (Renjal Mandal) కందకుర్తి గ్రామ సమీపంలో కందకుర్తి గోదావరి వంతెనను సీపీ సాయిచైతన్య పరిశీలించారు. కందకుర్తి వద్ద ఎగువన నిజాంసాగర్ కెనాల్ (Nizamsagar Canal) నుండి భారీగా వస్తున్న వరద కారణంగా పాత వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రాంతాన్ని సీపీ పరిశీలించి స్థానిక పోలీసులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్​ గాని డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659700 సంప్రదించాలని తెలియజేశారు.

బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ (Bodhan ACP P Srinivas), బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్, ఏఈవో గోపికృష్ణ తదితరులు సీపీ వెంట ఉన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.