Kalvakuntla Kavitha | సింగరేణిలో అవినీతి.. కాంగ్రెస్​ నేతలకు వాట.. కవిత సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | సింగరేణి (Singareni)లో ప్రతి కాంట్రాక్ట్​లో భారీగా అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అందులో నుంచి కాంగ్రెస్ నాయకులకు వాటా వెళ్తోందని ఆమె ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, డిపెండెంట్​ ఉద్యోగాలను పునరుద్ధించాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్​ (Hyderabad)లోని సింగరేణి భవన్​ని ముట్టడించారు. తెలంగాణ జాగృతి, హెచ్​ఎంఎస్​ (HMS) ఆధ్వర్యంలో సింగరేణి భవన్​ ముట్టడి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | సింగరేణి (Singareni)లో ప్రతి కాంట్రాక్ట్​లో భారీగా అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అందులో నుంచి కాంగ్రెస్ నాయకులకు వాటా వెళ్తోందని ఆమె ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, డిపెండెంట్​ ఉద్యోగాలను పునరుద్ధించాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్​ (Hyderabad)లోని సింగరేణి భవన్​ని ముట్టడించారు.

తెలంగాణ జాగృతి, హెచ్​ఎంఎస్​ (HMS) ఆధ్వర్యంలో సింగరేణి భవన్​ ముట్టడి చేపట్టారు. కవిత మాట్లాడుతూ.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి కవిత ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు ఆమెను అరెస్ట్​ చేసి నాంపల్లి పోలీస్​ స్టేషన్​ (Nampalli Police Station)కు తరలించారు.

Kalvakuntla Kavitha | న్యాయం జరిగే వరకు పోరాటం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజల గొంతులను నొక్కేస్తుందని కవిత విమర్శించారు. తనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యక్తీకరణ పట్ల ప్రభుత్వానికి పెరుగుతున్న అసహనాన్ని సూచిస్తోందన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల (Dependent jobs)ను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. సింగరేణి ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.

Kalvakuntla Kavitha | వేలాన్ని నిలిపివేయాలి

రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్​లో అవినీతి జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.