Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఫైర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్​ ఖర్గే ఫైర్​ అయ్యారు. పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత కేంద్రం ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా.. కేంద్రం యుద్ధాన్ని అర్ధంతరంగా ఎందుకు ఆపేసిందని దుయ్యబట్టారు. పాక్‌(Pakistan)ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతలు(BJP Leaders).. యుద్ధాన్ని ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేశారు.. మరి, మోదీ ఏం చేశారన్నారు. బీహార్​ ఎన్నికల ప్రచారంపై […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్​ ఖర్గే ఫైర్​ అయ్యారు. పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత కేంద్రం ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా.. కేంద్రం యుద్ధాన్ని అర్ధంతరంగా ఎందుకు ఆపేసిందని దుయ్యబట్టారు. పాక్‌(Pakistan)ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతలు(BJP Leaders).. యుద్ధాన్ని ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేశారు.. మరి, మోదీ ఏం చేశారన్నారు. బీహార్​ ఎన్నికల ప్రచారంపై ప్రధానికి ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదని విమర్శించారు.

Mallikarjun Kharge | దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలిచ్చింది..

దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొన్నారు. ‘గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చినవాళ్లు ఉన్నారు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో అలాంటివాళ్లు ఉన్నారా..’ అని వ్యాఖ్యానించారు. పహల్​గామ్​ ఉగ్రదాడిని కాంగ్రెస్​ ఖండించిందని.. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థించిందని పేర్కొన్నారు. పహల్​గామ్​ ఉగ్రదాడిపై కాంగ్రెస్​ నేతలు(Congress Leaders) అన్ని దేశాలు తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు.

Mallikarjun Kharge | అమెరికా యుద్ధనౌకలను పంపినా బెదరని ఇందిరా గాంధీ

1971 ఇండియా – పాకిస్తాన్​ మధ్య యుద్ధం జరిగిందని ఖర్గే గుర్తు చేశారు. ఆ సమయంలో అమెరికా యుద్ధనౌకలను పంపినా కూడా ఇందిరా గాంధీ బెదరకుండా యుద్ధాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్​ రెండు ముక్కలుగా చేశారన్నారు. మరి మోదీ(PM Modi) ప్రస్తుతం ఏం చేశారని ప్రశ్నించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.