CM Revanth Reddy | రాహుల్‌, ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

అక్షరటుడే, వెబ్​డెస్క్:CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal)​తో సమావేశం అయిన విషయం తెలిసిందే. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు. అధిష్టానం నుంచి అనుమతి లభించడంతో పలువురికి పీసీసీ పదవులు(PCC positions) ఖరారు చేశారు. 27 మందిని ఉపాధ్యక్షులుగా, 69 మందిని ప్రధాన కార్యదర్శులుగా కాంగ్రెస్​ నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal)​తో సమావేశం అయిన విషయం తెలిసిందే. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు.

అధిష్టానం నుంచి అనుమతి లభించడంతో పలువురికి పీసీసీ పదవులు(PCC positions) ఖరారు చేశారు. 27 మందిని ఉపాధ్యక్షులుగా, 69 మందిని ప్రధాన కార్యదర్శులుగా కాంగ్రెస్​ నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.

CM Revanth Reddy | కీలక అంశాలపై చర్చ

తాజాగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై మంగళవారం కీలక సమావేశం జరుగుతోంది. ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్​రెడ్డి కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge), లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ(Rahul Gandhi)తో సమావేశం అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఆయన చర్చిస్తున్నారు.

అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారి గురించి సీఎం వారికి వివరించినట్లు సమాచారం. త్వరలోనే మరికొంత మంది సీనియర్లకు పార్టీ, ప్రభుత్వ పదవులపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి శాఖల కేటాయింపుతో పాటు పలువురికి శాఖల మార్పు ఉండవచ్చని సమాచారం.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.