Homeజిల్లాలునిజామాబాద్​KTR | కేటీఆర్​కు ఘనస్వాగతం పలికిన బీఆర్​ఎస్​ శ్రేణులు

KTR | కేటీఆర్​కు ఘనస్వాగతం పలికిన బీఆర్​ఎస్​ శ్రేణులు

ఆదిలాబాద్​ వెళ్తున్న కేటీఆర్​కు జిల్లాలోని మెండోరా, ఆర్మూర్​లో బీఆర్​ఎస్​ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి, నాయకులు కేటీఆర్​ను సన్మానించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​/మెండోరా: KTR | ఆదిలాబాద్​ జిల్లాలో (Adilabad district) పత్తిరైతులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.

జగిత్యాల మీదుగా జిల్లాలోకి అడుగపెట్టిన కేటీఆర్​కు మెండోరా మండలంలోని పోచంపాడ్ ఎక్స్​రోడ్​​ వద్ద ఎమ్మెల్యే వేములు ప్రశాంత్​రెడ్డి (MLA Vemulu Prashanth Reddy) పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. మెండోరా మండల (Mendora mandal) కార్యకర్తలు శేఖర్ రెడ్డి, మిస్పా రాజు, భాస్కర్, పాషా తదితరులు పాల్గొన్నారు.

KTR | ఆర్మూర్​ పట్టణంలో..

అనంతరం ఆయన ఆర్మూర్​ పట్టణానికి (Armoor Town) చేరుగా బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ నాయకులు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మూర్​ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, పోల సుధాకర్, జీజీ రామ్, మీరా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.