అక్షరటుడే, వెబ్డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని కలిచివేస్తోంది. పృథ్వీనాథ్ ఆలయ (Prithvinath temple) దర్శనానికి బొలెరో వాహనంలో బయలుదేరిన 15 మంది ప్రయాణికులు, దురదృష్టవశాత్తు బెల్వా బహుతా రెహ్రా మోడ్ సమీపంలో పెద్ద ప్రమాదానికి గురయ్యారు.
భారీ వర్షాల (heavy rains) కారణంగా వాహనం అదుపు తప్పి సరయూ కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ గ్రామానికి చెందినవారు. మృతుల్లో బీనా (35), కాజల్ (22), మహాక్ (12), దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, సౌమ్య ఉన్నారు.
Uttar Pradesh | తీవ్ర విషాదం..
స్థానికుల కథనం ప్రకారం.. కారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నించినా, డోర్లు తెరుచుకోకపోవడం, అద్దాలు పగలకపోవడం వల్ల అంతులేని విషాదం చోటు చేసుకుంది. కొందరిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా, ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందిని రక్షించలేకపోయారు. సంఘటనా స్థలంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రమాదం మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు తలెత్తిస్తోంది. భారీ వర్షాల సమయంలో రోడ్లు జారుడుగా మారడం, వాహనాలపై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ఇటువంటి విషాదానికి కారణమవుతున్నాయి. బాధితులు ఓకే కుటుంబానికి చెందడం వల్ల ఈ ఘటన మరింత విషాదంగా మారింది. ఇది ప్రతి డ్రైవర్కు, ప్రతి ప్రయాణికుడికి ఒక హెచ్చరిక అని అంటున్నారు.