Municipal elections | మున్సిపల్​ ఎన్నికలు.. జనసేనతో పొత్తుపై బీజేపీ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Municipal elections | తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ (Janasena party) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీతో పొత్తు ఉంటుందా అనే చర్చ ప్రారంభం అయింది. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు (BJP state president Ramachandra Rao) క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్​ ప్రకటించారు. తమకు పొత్తు అవసరం లేదన్నారు. ఏపీలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Municipal elections | తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ (Janasena party) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీతో పొత్తు ఉంటుందా అనే చర్చ ప్రారంభం అయింది. దీనిపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు (BJP state president Ramachandra Rao) క్లారిటీ ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్​ ప్రకటించారు. తమకు పొత్తు అవసరం లేదన్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ జత కట్టిందన్నారు. కానీ తెలంగాణలో పరిస్థితులు వేరని చెప్పారు. తాము మున్సిపల్​ ఎన్నికల్లో సింగిల్​గానే పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని చెప్పారు.

Municipal elections | పవన్​దే నిర్ణయం

బీజేపీ అధ్యక్షుడు రామచందర్​రావు వ్యాఖ్యలపై జనసేన నాయకులు స్పందించారు. పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​దే (Pawan Kalyan) తుది నిర్ణయమని చెప్పారు. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయాన్ని ఆయన నిర్ణయిస్తారని తెలంగాణ జనసేన ఇన్​ఛార్జి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. పొత్తు ఉన్నా లేకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో దిగుతుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలంగా ఉన్న చోట్ల అభ్యర్థులను నిలబెడతామన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.