ePaper
More
    HomeతెలంగాణJagga Reddy | క‌విత లేఖ‌తో బీజేపీకే లాభం.. కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి

    Jagga Reddy | క‌విత లేఖ‌తో బీజేపీకే లాభం.. కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jagga Reddy | బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆమె ముద్దుల త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha) రాసిన లేఖ అంతిమంగా బీజేపీకే ల‌బ్ధి చేకూర్చేలా ఉంద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జ‌గ్గారెడ్డి అన్నారు. ప్ర‌స్తుత పరిణామాల‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిన త‌న తండ్రికి లేఖ రాశార‌ని, డిప్రెష‌న్‌లో లేఖ విడుద‌ల చేసింద‌న్నారు. ఆదివారం జ‌గ్గారెడ్డి(Jagga Reddy) విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కవిత లేఖలతో కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. ఆమె చర్యలు బీజేపీ(BJP) ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ను చంపడం, బతికించుకోవడం వాళ్ళ వ్యక్తిగతమని, కవిత లేఖ వల్ల బీఆర్ఎస్(BRS) ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయిందని చెప్పారు. కవిత వల్ల ఆ పార్టీ క్యాడర్ లీడర్స్ బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నారు.

    Jagga Reddy | బ‌ల‌వంతురాలే కాదు..

    క‌విత(Kavitha) స‌హ‌జంగా ఎదిగిన నాయకురాలు కాద‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. ఆమె తండ్రి చాటు బిడ్డగా లీడర్ అయిందని, డైరెక్ట్ లీడర్ కాలేద‌ని తెలిపారు. క‌విత రాజకీయంగా బలవంతురాలు కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టినా దాన్ని న‌డ‌ప‌డం అంత ఈజీ కాద‌ని వ్యాఖ్యానించారు. క‌విత చ‌ర్య‌ల వ‌ల్ల కాంగ్రెస్‌(Congress)కు న‌ష్టం లేక‌పోయినా బీజేపీకి మాత్రం ప్ర‌యోజనం ద‌క్కుతుంద‌న్నారు.

    Jagga Reddy | కేసీఆర్‌ను స‌మాధి చేసే య‌త్నం

    కేసీఆర్(KCR) కుటుంబంలో, పార్టీలో క‌విత లేఖ కలకలం రేపిందని జ‌గ్గారెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత అంశాలు ఉంటాయన్నారు అయితే, కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన్ని జీవ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన కోణంలోనే కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని, తర్వాత.. అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి పట్టం కట్టారని తెలిపారు. ఏ చరిత్ర చూసుకున్నా కొడుకే వారసుడని గుర్తు చేశారు. మొత్తంగా క‌విత బీఆర్ఎస్ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలం పెంచుతున్నారని తెలిపారు. కవిత రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించదని, కేసీఆర్ కూతురు కాబట్టే కవిత ఎపిసోడ్‌పై మీడియాకి ఆసక్తి అని స్పష్టం చేశారు.

    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లేఖలో పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే, కవిత లేఖపై తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...