Kamareddy | డివైడర్​ను ఢీకొన్న బైక్.. దంపతులకు గాయాలు

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | బైక్ అదుపు తప్పి డివైడర్​ను (divider) ఢీకొట్టగా దంపతులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal) కుప్రియాల్ స్టేజీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కమ్మరి నవీన్, సౌందర్య రోజు మాదిరిగానే కామారెడ్డికి పనికి వెళ్తున్నారు. కుప్రియాల్ స్టేజీ (Kupriyal Stage) వద్దకు రాగానే బైక్​ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న ఇద్దరికి […]

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | బైక్ అదుపు తప్పి డివైడర్​ను (divider) ఢీకొట్టగా దంపతులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన సదాశివనగర్ మండలం (Sadashivanagar Mandal) కుప్రియాల్ స్టేజీ వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కమ్మరి నవీన్, సౌందర్య రోజు మాదిరిగానే కామారెడ్డికి పనికి వెళ్తున్నారు. కుప్రియాల్ స్టేజీ (Kupriyal Stage) వద్దకు రాగానే బైక్​ అదుపు తప్పి డివైడర్​ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకొని తమ వాహనంలో ఇద్దరిని కామారెడ్డి జీజీహెచ్​కు తరలించారు. ఈ ప్రమాదంలో నవీన్​కు స్వల్ప గాయాలు కాగా, సౌందర్య తలకు బలమైన గాయమైంది. దాంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.