Mohanbabu University | మంచు మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ షాక్.. అధిక ఫీజుల వసూళ్లపై భారీ జ‌రిమానా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohanbabu University | టాలీవుడ్ ప్రముఖుడు మంచు మోహన్‌బాబు(Manchu Mohanbabu)కి చెందిన మోహన్‌బాబు యూనివర్సిటీ తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ విచారణలో ఆయన యూనివర్సిటీ 2022-23 నుంచి 2024 వరకు కన్వీనర్‌ కోటా విద్యార్థుల నుంచి అధికంగా రూ.26 కోట్లకు పైగా ఫీజులు వసూలు చేసిందని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయంపై రూ.15 లక్షల జరిమానా విధించడమే కాక, అదనంగా వసూలు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohanbabu University | టాలీవుడ్ ప్రముఖుడు మంచు మోహన్‌బాబు(Manchu Mohanbabu)కి చెందిన మోహన్‌బాబు యూనివర్సిటీ తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ విచారణలో ఆయన యూనివర్సిటీ 2022-23 నుంచి 2024 వరకు కన్వీనర్‌ కోటా విద్యార్థుల నుంచి అధికంగా రూ.26 కోట్లకు పైగా ఫీజులు వసూలు చేసిందని నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయంపై రూ.15 లక్షల జరిమానా విధించడమే కాక, అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లుని 15 రోజుల్లో విద్యార్థులకు తిరిగి చెల్లించాలన్న ఆదేశాలను జారీ చేసింది. ఇదే కాక, యూనివర్సిటీకి మంజూరైన గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ వంటి జాతీయ స్థాయి విద్యా నియంత్రణ సంస్థలకు కమిషన్ సిఫారసు చేసింది.

Mohanbabu University | ఎందుకు ఈ జరిమానా?

తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీ 2022లో ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మోహన్‌బాబు యూనివర్సిటీగా (Mohan Babu University) మారింది. గ్రీన్‌ఫీల్డ్ యూనివర్సిటీగా మారిన తరువాత, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు స్ట్రక్చర్‌కు వ్యతిరేకంగా యూనివర్సిటీ అధికంగా ఫీజులు వసూలు చేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రుల అసోసియేషన్, విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేశారు.కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి మాత్రమే కాదు, హాస్టల్‌లో ఉండని వారి నుంచి కూడా మెస్ ఛార్జీలు వసూలు చేయడం, అదనపు బిల్డింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపింది. అందులో ఆరోపణలు నిజమని తేలింది.

కమిషన్ ఆదేశాలపై మోహన్‌బాబు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Andhra Pradesh High Court)ను ఆశ్రయించగా, కోర్టు గత నెల 26న మూడు వారాల తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కి వాయిదా పడింది. ఈ కేసు ప్రస్తుతం న్యాయపరంగా ముందుకెళ్తోంది. ఇక ఇప్పటికే యూనివర్సిటీపై AICTEతోపాటు ఇతర కేంద్ర సంస్థలకు కూడా పలు ఫిర్యాదులు వెళ్లాయి. విద్యార్థి సంఘాలు మీడియా సమావేశాలు నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశాయి. గతంలో మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య జరిగిన కుటుంబ వివాద సమయంలో, మనోజ్ తన తండ్రి మోహన్‌బాబు యూనివర్సిటీపై వచ్చిన ఆరోపణల విషయంలో విద్యార్థులకు మద్దతుగా ఉంటానని ప్రకటించడమే కాకుండా, తల్లిదండ్రుల పక్షాన నిలుస్తానని చెప్పడం సంచలనం రేపింది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.