Homeజిల్లాలుహైదరాబాద్Drinking Water | హైదరాబాద్​ వాసులకు అలెర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

Drinking Water | హైదరాబాద్​ వాసులకు అలెర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drinking Water | హైదరాబాద్​ (Hyderabad) నగర వాసులకు జలమండలి అధికారులు కీలక సూచనలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 26న తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1,2, 3 పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే బ‌ల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్​ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చడానికి చర్యలు చేపట్టారు. దీని కోసం నాసర్లపల్లి జలమండలి (Jala Mandali) పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్లకు బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్​ సరఫరా నిలిపి వేయనున్నారు. ఫలితంగా పలు ప్రాంతాలకు నీటిని తాగునీటి సరఫరాలో పాక్షిక అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు.

Drinking Water | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

నగరంలోని చార్మినార్, వినయ్ నగర్, బొజగుట్ట, రెడ్ హిల్స్, నారాయణ గూడ, మారేడ్​పల్లి, ఎస్ఆర్ నగర్, కూకట్​పల్లి, రియాసత్​ నగర్​, సాహెబ్ నగర్, హయత్ నగర్, సైనిక్ పురి, ఉప్పల్, హఫీజ్​పేట్, రాజేంద్ర నగర్, మణికొండ, బోడుప్పల్, మీర్ పేట్ డివిజన్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.