అక్షరటుడే, కమ్మర్పల్లి : Kammarpally | కువైట్కు వెళ్లిన యువకుడు అక్కడ తప్పిపోగా ప్రభుత్వం తీసుకున్న చొరవతో తిరిగి స్వదేశానికి చేరాడు. వివరాల్లోకి వెళ్తే.. కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామానికి (Hasakottur Village) చెందిన గిరిజన యువకుడు ఈశ్వర్ 30 రోజులుగా కువైట్లో ఆచూకీ లేకుండా పోయాడు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే కాంగ్రెస్ పార్టీ (Balkonda Congress Party) బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సునీల్రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ నాయకుడు పడిగల ప్రవీణ్ బాధిత కుటుంబ సభ్యులను హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ ప్రవాసి ప్రజావాణిలో (Prajavani) ఇన్ఛార్జీగా ఉన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, రాష్ట్ర గల్ఫ్ అడ్వైజర్ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి విన్నవించారు.
దీంతో స్పందించిన వారు.. కువైట్లోని భారత దేశ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అక్కడ పోలీసుల చెరలో ఉన్న ఈశ్వర్ను విడిపించి స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ మేరకు ఈశ్వర్ స్వదేశానికి వచ్చేందుకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
