Ayodhya Ram Mandir | అయోధ్యలో అద్భుత ఘట్టం.. ధ్వజారోహణం చేసిన మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya Ram Mandir | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) హాజరై ఆలయంపై కాషాయ జెండా ఎగుర వేశారు. ధ్వజారోహణం కార్యక్రమం నేపథ్యంలో ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపి వేశారు. మంగళవారం ఉదయం ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ముందుగా ఆయన సప్తర్షి మందిరంలో ప్రత్యేక […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ayodhya Ram Mandir | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. ఆలయ నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) హాజరై ఆలయంపై కాషాయ జెండా ఎగుర వేశారు.

ధ్వజారోహణం కార్యక్రమం నేపథ్యంలో ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపి వేశారు. మంగళవారం ఉదయం ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ముందుగా ఆయన సప్తర్షి మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాల రాముడిని దర్శించుకున్నారు. ప్రధాని వెంట ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్ (RSS chief Mohan Bhagwat)​, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్​ (UP CM Yogi Adityanath) ఉన్నారు. అనంతరం మోదీ రామమందిరం పైన కాషాయ జెండాను ఎగురవేశారు. పూజారులు అత్యంత పవిత్రమైనదిగా భావించే అభిజీత్ ముహూర్తంలో ఈ వేడుక నిర్వహించారు. సూర్యుడు, ఓం, కోవిదార్ చెట్టు జెండాపై ఉన్నాయి. 191 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేశారు.

Ayodhya Ram Mandir | రెండో ప్రాణప్రతిష్ఠ

అయోధ్య రామాలయం (Ayodhya Ramalayam)లో 2024 జనవరిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే ఆలయ నిర్మాణ పనులు అప్పటికి ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెండో ప్రాణ ప్రతిష్ఠగా అభివర్ణిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 7 వేల మంది అతిథులు పాల్గొన్నారు.

Ayodhya Ram Mandir | పటిష్ట బందోబస్తు

ప్రధాని పర్యటన, ధ్వజారోహణం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను బలోపేతం చేశారు. ATS కమాండోలు, NSG స్నిపర్లు, సైబర్ బృందాలు మరియు సాంకేతిక సిబ్బందితో సహా మొత్తం 6970 మంది భద్రతా సిబ్బందిని నగరంలో మోహరించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.