Volcano Eruption | పది వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. భారత్​లో పలు విమానాలు రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Volcano Eruption |  ఓ అగ్ని పర్వతం దాదాపు 10 వేళ ఏళ్ల తర్వాత బద్దలైంది. దీని ప్రభావంతో బూడిద 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసి పడింది. ఆ బూడిద మేఘాలు 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్​పై సైతం ప్రభావం చూపాయి. ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం (Haile Gubbi Volcano) నవంబర్‌ 23న ఉదయం విస్పోటనం చెందింది. డనాకిల్‌ డిప్రెషన్‌ ప్రాంతంలో దీనిని గుర్తించారు. భూమి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Volcano Eruption |  ఓ అగ్ని పర్వతం దాదాపు 10 వేళ ఏళ్ల తర్వాత బద్దలైంది. దీని ప్రభావంతో బూడిద 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసి పడింది. ఆ బూడిద మేఘాలు 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్​పై సైతం ప్రభావం చూపాయి.

ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం (Haile Gubbi Volcano) నవంబర్‌ 23న ఉదయం విస్పోటనం చెందింది. డనాకిల్‌ డిప్రెషన్‌ ప్రాంతంలో దీనిని గుర్తించారు. భూమి కింద షీల్డ్‌ వోల్కానో నుంచి 15 కి.మీ ఎత్తుకు ఎగసిపడుతూ బూడిద ఆకాశాన్ని కమ్మేసింది. బూడిద మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్‌కు చేరుకున్నాయి. అనంతరం అరేబియా సముద్రం (Arabian Sea) మీదుగా పశ్చిమ, ఉత్తర భారతదేశం (North India) వైపు ప్రయాణించింది. ఇవి ప్రస్తుతం తూర్పు వైపు చైనా వైపు కదులుతున్నాయి. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు భారత ఆకాశాన్ని క్లియర్ చేస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది.

Volcano Eruption | విమాన రాకపోకలకు అంతరాయం

అగ్నిపర్వత బూడిద గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు వంటి భారత రాష్ట్రాలకు చేరుకుని, హిమాలయాలు, నేపాల్ కొండల వైపు వెళ్లింది. ఇథియోపియా నుంచి బూడిద మేఘాన్ని అధిక ఎత్తులో ఉన్న గాలులు ఎర్ర సముద్రం, యెమెన్ మరియు ఒమన్ మీదుగా మోసుకెళ్లి అరేబియా సముద్రం మరియు భారత గగనతలాన్ని చేరాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర వివరించారు. ఆకాశాన్ని బూడిద మేఘాలు కప్పేయడంతో భారత్​లోని పలు విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ఫ్లైట్​లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.