Limbadri Gutta | లింబాద్రి గుట్ట అభివృద్ధికి ముందడుగు.. పీసీసీ చీఫ్​ చొరవతో నిధులు విడుదల

అక్షరటుడే, భీమ్​గల్​: Limbadri Gutta | భీమ్​గల్ (Bheemgal) శివారులోని శ్రీ మన్నింబాచల క్షేత్రం లింబాద్రిగుట్ట (Limbadri Gutta) అభివృద్ధికి ముందడుగు పడింది. ఇటీవల గుట్టపై లక్ష్మీనృసింహస్వామి (Lord Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో టీపీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్ (PCC Chief Bomma) పాల్గొన్నారు. నృసింహస్వామి దర్శనం అనంతరం ఆలయాభివృద్ధికి హామీ ఇచ్చారు. Limbadri Gutta | పీసీసీ చీఫ్​ చొరవతో నిధులు.. ఈ మేరకు […]

అక్షరటుడే, భీమ్​గల్​: Limbadri Gutta | భీమ్​గల్ (Bheemgal) శివారులోని శ్రీ మన్నింబాచల క్షేత్రం లింబాద్రిగుట్ట (Limbadri Gutta) అభివృద్ధికి ముందడుగు పడింది. ఇటీవల గుట్టపై లక్ష్మీనృసింహస్వామి (Lord Lakshmi Narasimha Swamy) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో టీపీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్ (PCC Chief Bomma) పాల్గొన్నారు. నృసింహస్వామి దర్శనం అనంతరం ఆలయాభివృద్ధికి హామీ ఇచ్చారు.

Limbadri Gutta | పీసీసీ చీఫ్​ చొరవతో నిధులు..

ఈ మేరకు మహేశ్​ కుమార్​ గౌడ్​ సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth reddy) ప్రత్యేకంగా చర్చించారు. లింబాద్రి గుట్ట విశేషాలను ఆయనకు వివరించారు. అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును (Minister Jupally Krishna Rao) సైతం కలిసి లింబాద్రి గుట్ట అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

గుట్టపై టూరిజం గెస్ట్​హౌజ్ (Tourism Guesthouse)​, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని వివరించారు. దీంతో ​ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు గుట్టపై టూరిజం గెస్ట్​హౌస్​ కోసం రూ.4 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్మూర్​ సిద్ధుల గుట్ట అభివృద్ధికి..

ఆర్మూర్​లో (Armoor) ప్రసిద్ధమైన సిద్ధుల గుట్టపై (Siddula Gutta) కాటేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భక్తుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణం కోసం రూ.50లక్షలు మంజురు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.