Saudi Arabia | ఎడారి దేశంలో తప్పిపోయిన వ్యక్తి.. వేయికళ్లతో ఎదురుచూస్తున్న కుటుంబీకులు..

అక్షరటుడే గాంధారి: Saudi Arabia | ఉపాధి కోసం ఏడారి దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి అనూహ్య పరిస్థితుల్లో అనారోగ్యం భారిన పడ్డాడు. దీంతో అతడిని స్నేహితులు ఇండియా పంపేందుకు ఎయిర్​పోర్ట్​లో తీసుకురాగా.. అక్కడ అతడు ఫ్లైట్​ ఎక్కకుండా కనిపించకుండా పోయాడు. ఇటు ఇండియా రాకుండా.. సౌదీలో (Saudi Arabia) కనిపించకపోవడంతో ఆయన కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు. Saudi Arabia | వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలకేంద్రానికి చెందిన చాకలి కాశీరాం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. […]

అక్షరటుడే గాంధారి: Saudi Arabia | ఉపాధి కోసం ఏడారి దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి అనూహ్య పరిస్థితుల్లో అనారోగ్యం భారిన పడ్డాడు. దీంతో అతడిని స్నేహితులు ఇండియా పంపేందుకు ఎయిర్​పోర్ట్​లో తీసుకురాగా.. అక్కడ అతడు ఫ్లైట్​ ఎక్కకుండా కనిపించకుండా పోయాడు. ఇటు ఇండియా రాకుండా.. సౌదీలో (Saudi Arabia) కనిపించకపోవడంతో ఆయన కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు.

Saudi Arabia | వివరాల్లోకి వెళ్తే..

గాంధారి మండలకేంద్రానికి చెందిన చాకలి కాశీరాం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ గొర్ల కాపరిగా పని చేస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా అతడి ఆరోగ్యం క్షీణించి ఎవరికీ గుర్తుపట్టలేని స్థితికి వెళ్లిపోయాడు. దీంతో స్పందించిన అతడి స్నేహితులు అంతా కలిసి అతడిని తీసుకుని ఇండియా పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అతడిని సౌదీ అరేబియా ఏయిర్​పోర్టులో ఇండియాకు టికెట్​ బుక్​ చేసి.. బోర్డింగ్​ పాస్​ సైతం ఇప్పించారు. అయితే లోపలికి వెళ్లిన కాశీరాం తర్వాత ఎక్కడికి వెళ్లాడో అంతుచిక్కకుండా పోయింది. ఇటు ఇండియాకు రాక.. సౌదీలో కనిపించకపోవడంతో కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు. అయితే అతడికి మతిస్థిమితం లేకపోవడంతో పోలీసులు అతడిని అడ్డుకుని ఉంటారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Saudi Arabia | సాయం చేసినా..

కాశీరాం స్నేహితుడు రమేశ్​ కపిల్​ అంతాతానై అక్కడ కాశీరాంను ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశాడని.. కానీ అధికారులు కాశీరాంను నిర్భందించడంతో అతడు సైతం ఏమీ చేయలేని స్థితిలో పడ్డాడని కాశీరాం కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాశీరాంకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు ఉన్నారు.

కేటీఆర్, ఎమ్మెల్యే మదన్మోహన్​ను కలిసిన బాధిత కుటుంబీకులు..

కాశీరాంను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని కోరుతూ బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రసిడెంట్​ కేటీఆర్ (BRS Working President KTR)​, ఎమ్మెల్యే మదన్​మోహన్​ను (MLA Madan Mohan) బాధిత కుటుంబసభ్యులు కలిశారు. ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.