Education Department | డీసీఈబీ కార్యదర్శిగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిని నియమించాలి

అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం (District Common Examinations Department) కార్యదర్శిగా గెజిటెడ్ హెచ్​ఎంను నియమించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (Government Teachers Association) అధ్యక్షుడు సాయి రెడ్డి, పీఆర్​టీయూ (PRTU) తెలంగాణ గౌరవ అధ్యక్షుడు కృపాల్​సింగ్​ కోరారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కార్యదర్శి పదవీకాలం ముగిసిందని ఆయన హయాంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. వాటిని దృష్టిలో […]

అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం (District Common Examinations Department) కార్యదర్శిగా గెజిటెడ్ హెచ్​ఎంను నియమించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (Government Teachers Association) అధ్యక్షుడు సాయి రెడ్డి, పీఆర్​టీయూ (PRTU) తెలంగాణ గౌరవ అధ్యక్షుడు కృపాల్​సింగ్​ కోరారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కార్యదర్శి పదవీకాలం ముగిసిందని ఆయన హయాంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆయనకు పదవీ బాధ్యతలు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిని ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శిగా నియమించాలన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.