Homeజిల్లాలునిజామాబాద్​Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 32 ఫిర్యాదులు

Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 32 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నిజామాబాద్​ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Police Prajavani | ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత సీఐలు, ఎస్సైలతో (CIs and SIs) ఫోన్​లో మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ (district police department) పని చేస్తోందని తెలిపారు. కాగా.. పోలీస్​ ప్రజావాణికి 32 ఫిర్యాదులు వచ్చాయి.