Homeజిల్లాలునిజామాబాద్​Ration Rice | 29 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

Ration Rice | 29 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 29 టన్నుల బియ్యం సీజ్​ చేసి లారీని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Ration Rice | అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని (ration rice) పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగర (Nizamabad city) శివారులో దాదాపు 29 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం ఆ లారీని రూరల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

నిర్మల్ జిల్లా చించోలి మాజిద్ అనే రైస్ మిల్లు నుంచి నిజామాబాద్​కు (Nirmal district to Nizamabad) తరలిస్తున్న క్రమంలో పోలీసులు దాడి చేసి లారీని పట్టుకున్నారు. రైస్ మిల్లులకు అడ్డా అయినా కాలూరు రోడ్డులో గల పార్కింగ్ వద్ద నిలిపి ఉంచిన లారీలో తనిఖీలు చేశారు. అందులో 29 టన్నుల రేషన్​ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.