woman sub-inspector | అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యాపారి.. పట్టుకున్న మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించిన అతగాడి కూతురు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: woman sub-inspector | కర్ణాటక – ఆంధ్రా సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారు. అయినా అక్రమార్కులు ఆగడం లేదు. ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడుతున్నారు. తాజాగా మహిళా ఎస్సైపై జరిగిన దాడి ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో అక్రమ మద్యం వ్యాపారులు ఏకంగా పోలీసు అధికారిణిపైనే దాడి చేశారు. ఆగలి మహిళా ఎస్సై పై జరిగిన దాడి సంచలనంగా […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: woman sub-inspector | కర్ణాటక – ఆంధ్రా సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారు. అయినా అక్రమార్కులు ఆగడం లేదు. ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడుతున్నారు. తాజాగా మహిళా ఎస్సైపై జరిగిన దాడి ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో అక్రమ మద్యం వ్యాపారులు ఏకంగా పోలీసు అధికారిణిపైనే దాడి చేశారు. ఆగలి మహిళా ఎస్సై పై జరిగిన దాడి సంచలనంగా మారింది. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్సై శోభారాణి స్థానిక హోటల్​లో తనిఖీ చేపట్టారు.

woman sub-inspector |పైన హోటల్​.. లోన బెల్ట్​ షాప్​..

ఈ తనిఖీల్లో అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయింది. పైకి హోటల్​గానే ఉన్నా.. లోపల బెల్ట్ షాప్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మద్యం సీజ్​ చేసిన ఎస్సై శోభారాణి.. నిందితులైన తండ్రి మల్లికార్జున్, కూతురు కీర్తనను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను ఠాణాకు తరలించే క్రమంలో ఎస్సై శోభారాణితో మల్లికార్జున్, కీర్తన వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో శోభారాణి చెంపను కీర్తన చెళ్ళుమనిపించింది. దీనికితోడు మల్లికార్జున్ సైతం ఎస్సై శోభారాణిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్స్.. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

 

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...