Karnataka | కర్ణాటకలో సీఎం మారుతారా.. హైకమాండ్​కు చేరిన పంచాయితీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలో సీఎం మార్పుపై మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. సీఎం సిద్ధరామయ్యను (CM Siddaramaiah) తొలగించి డీకే శివకుమార్​కు ఆ పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్​ను (DK Shivakumar) సీఎం చేయాలని ఆయన వర్గం వారు డిమాండ్​ చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు (Karnataka Assembly elections) 2023 మేలో జరిగాయి. 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్​ 135 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పటి వరకు అధికారంలో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలో సీఎం మార్పుపై మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. సీఎం సిద్ధరామయ్యను (CM Siddaramaiah) తొలగించి డీకే శివకుమార్​కు ఆ పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్​ను (DK Shivakumar) సీఎం చేయాలని ఆయన వర్గం వారు డిమాండ్​ చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు (Karnataka Assembly elections) 2023 మేలో జరిగాయి. 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్​ 135 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ 66 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్​ గెలుపు కోసం సిద్ధరామయ్యతో పాటు, డీకే శివకుమార్​ తీవ్రంగా కృషి చేశారు. దీంతో సీఎం పీఠం కోసం ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్​ అధిష్టానం (congress high command) మాత్రం అంతకు ముందు సీఎంగా చేసిన సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. డీకే వర్గం మాత్రం చెరో రెండున్నరేళ్లు పదవి ఇవ్వాలని డిమాండ్​ చేసింది. సిద్ధరామయ్య సీఎం అయి రెండున్నరేళ్లు పూర్తి అవుతోంది. ఈ క్రమంలో డీకే శివకుమార్​ను సీఎం చేయాలని ఆయన వర్గం తాజాగా మళ్లీ కోరుతోంది.

Karnataka | ఢిల్లీకి చేరిన పంచాయితీ

కర్ణాటకలో అధికారిక పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌కు (Delhi high command) చేరింది. ఈ రోజు రాత్రికి శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లనున్నారు. శివకుమార్​ సీఎం పగ్గాలు ఇవ్వాలని హైకమాండ్‌ను వారు కోరనున్నారు. మరోవైపు సీఎం మార్పు వార్తలు ఊహాగానాలని సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేస్తున్నారు. తన స్థానం మొదటి నుండి బలంగా ఉందని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారని సీఎం తెలిపారు. తాము ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చడానికి పని చేస్తున్నట్లు చెప్పారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...