Pawan Kalyan | పవన్​ కల్యాణ్​ సారీ చెబుతారా.. మరోసారి ఫైర్​ అయిన జడ్చర్ల ఎమ్మెల్యే

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | తెలంగాణ ప్రజలపై ఇటీవల పవన్​ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు పవన్​ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ఇటీవల కోనసీమలో పర్యటించారు. ఆ సమయంలో తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయాయని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | తెలంగాణ ప్రజలపై ఇటీవల పవన్​ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులు పవన్​ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ఇటీవల కోనసీమలో పర్యటించారు. ఆ సమయంలో తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయాయని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్​ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన సినిమాలు ఆడనివ్వమని సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Komatireddy Venkat Reddy) హెచ్చరించారు. అయినా పవన్​ కల్యాణ్​ ఇప్పటి వరకు తన వ్యాఖ్యలపై స్పందించలేదు.

Pawan Kalyan | సినిమాలు ఆడనివ్వం

పవన్​ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. ఆయన ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు. కానీ పార్టీ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రాజోలు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దని జనసేన కోరింది. అయితే పవన్​ క్షమాపణ చెప్పాలని తెలంగాణ నాయకులు (Telangana Leaders) డిమాండ్​ చేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి (MLA Anirudh Reddy) మరోసారి పవన్​పై ఫైర్​ అయ్యారు. ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించారు. సారీ చెప్పే వరకు జడ్చర్లలో ఆయన సినిమా ఆడనిచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదన్నారు.

Pawan Kalyan | బర్తరఫ్​ చేయాలి

పవన్​ కల్యాణ్​ను బర్తరఫ్​ చేయాలని సీపీఐ నారాయణ (CPI Narayana) డిమాండ్​ చేశారు. ఆయన మాటలతో తెలుగు ప్రజల ఐక్యత దెబ్బతినే ప్రమాదముందన్నారు. ఓసారి చేగువేరా అన్నాడు.. మరోసారి సావర్కర్ శిష్యుడు అన్నాడని విమర్శించారు. డిప్యూటీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...