Nandyal | భర్తను చంపి డోర్​ డెలివరీ చేసిన భార్య.. నంద్యాలలో ఘటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandyal : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత కఠినంగానైనా మారతారనేది నేటి ఒరవడి.. పెళ్లికి ముందే ప్రియుడితో సంబంధం, పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం కారణం ఏదైనా.. భర్తలను కడతేర్చుతున్నారు భార్యలు. ఇటీవల రోజుకో ఘటన వెలుగుచూస్తోంది. ఇలాంటి వార్త‌లు వింటుంటే పెళ్లంటే భ‌య‌పడిపోతున్నారు యువకులు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆమెతో సంసారం చేయాలంటే కూడా ఎప్పుడు ఏమి జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ కొంద‌రిలో ఉంటోంది. తాజాగా […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nandyal : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత కఠినంగానైనా మారతారనేది నేటి ఒరవడి.. పెళ్లికి ముందే ప్రియుడితో సంబంధం, పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం కారణం ఏదైనా.. భర్తలను కడతేర్చుతున్నారు భార్యలు. ఇటీవల రోజుకో ఘటన వెలుగుచూస్తోంది.

ఇలాంటి వార్త‌లు వింటుంటే పెళ్లంటే భ‌య‌పడిపోతున్నారు యువకులు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆమెతో సంసారం చేయాలంటే కూడా ఎప్పుడు ఏమి జ‌రుగుతుందోన‌న్న టెన్ష‌న్ కొంద‌రిలో ఉంటోంది. తాజాగా భార్య (Wife) చేతిలో మ‌రో అమాయ‌కుడు బ‌లి అయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లోని నంద్యాలలో చోటుచేసుకుంది.

ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. భర్తను చంపిన భార్య, అతడి మృతదేహాన్ని ఇంటికి పార్సిల్​ parcel చేసి మరీ వెళ్లింది ఈ కఠినాత్మురాలు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

నంద్యాల జిల్లాలోని నూనెప‌ల్లికి చెందిన ర‌మ‌ణకు పిడుగురాళ్ల‌కు చెందిన ర‌మ‌ణ‌మ్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా, గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రమణమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది.

రమణమ్మ తన మనసు మార్చుకుని మెట్టింటికి వస్తుందేమో అని ఆశగా ఎదురుచూసిన రమణకు నిరాశే ఎదురైంది. దీంతో ఆమెను నచ్చజెప్పి ఇంటికి తెచ్చుకోవాలని అనుకున్నాడు. వెంటనే రమణమ్మ పుట్టింటికి వెళ్లాడు.

కానీ, జరిగింది వేరు. ఇంటికి వచ్చిన అల్లుడిని గౌరవించడం పక్కనుంచి కనీస మర్యాద కూడా ఇవ్వలేదు. పైపెచ్చు రమణమ్మ కుటుంబ సభ్యులు గొడవకు దిగి దాడి చేశారు.

Nandyal : కళ్లలో కారం చల్లి దాడి..

రమణ కళ్లలో కారం చల్లి దారుణంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మృతదేహాన్ని నిందితులు నంద్యాలలోని రమణ ఇంటి వద్దకు తీసుకొచ్చి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు Police ఘటనాస్థలికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...