అక్షరటుడే,కోటగిరి : Kotagiri | భర్త మందలించాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన పోతంగల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సాయిలు, సూదాం గంగామణి భార్యాభర్తలు. ఇంటి ఎదుట పాతిన ఓ కర్ర విషయంలో వాగ్వాదం కాగా.. భర్త మందలించడంతో మనస్థాపం చెందిన గంగామణి మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. బుధవారం చెరువలో ఆమె మృతదేహం లభ్యమైంది. కొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
