PCC Chief | శ్రీరాముడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు.. : పీసీసీ చీఫ్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : PCC Chief | అందరికీ దేవుడైన శ్రీరాముడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో (Congress Party Office) విలేకరుల సమావేశం నిర్వహించారు. PCC Chief | రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా..? కులం, మతం పేరిట బీజేపీ ఎన్నికల్లో రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్​ విమర్శించారు. ఎన్నికలొస్తే చాలు.. దేవుళ్ల […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : PCC Chief | అందరికీ దేవుడైన శ్రీరాముడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అన్నారు. ఈ మేరకు సోమవారం నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో (Congress Party Office) విలేకరుల సమావేశం నిర్వహించారు.

PCC Chief | రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా..?

కులం, మతం పేరిట బీజేపీ ఎన్నికల్లో రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్​ విమర్శించారు. ఎన్నికలొస్తే చాలు.. దేవుళ్ల పేరు చెప్పుకుంటూ తిరుగుతారని పేర్కొన్నారు. రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా.. అని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే బీజేపీ (BJP) మతం పేరిట రాముడి పేరిట ఓట్లడుగుతూ లబ్ది పొందాలనుకోవడం శోచనీయనన్నారు. దేవుడి పేరిట ఓట్లడిగే వారికి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. దేవుడి పేరిట కాకుండా 12ఏళ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని సలహా ఇచ్చారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్​ బిన్​ హందాన్​, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు దాసరి నర్సింలు, నరాల రత్నాకర్, వినయ్ రెడ్డి, జావిద్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...