అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasingh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ఎద్దేవా చేశారు.
రాజాసింగ్ కొంతకాలంగా కిషన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
బీజేపీ(BJP)కి రాజీనామా చేసినా.. ఆయన కేంద్ర మంత్రిపై మాత్రం విమర్శలు ఆపడం లేదు. తెలంగాణలో బీజేపీ బలపడకపోవడానికి కిషన్రెడ్డి (Kishan Reddy)కారణమని ఆయన గతంలో ఆరోపించారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయంలో సైతం విమర్శలు చేశారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజాసింగ్ తన మాటల తూటలు వదిలారు.
Rajasingh | ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills By Election) త్వరలో జరగనుంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం సైతం ప్రారంభించాయి. అయితే బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ప్రచారంలో సైతం వెనకబడిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజాసింగ్(Rajasingh) మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయం జూబ్లీహిల్స్ ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపిస్తారా, కాంగ్రెస్ని గెలిపిస్తారా అని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. కిషన్రెడ్డి గౌరవం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యలు చేశారు.
Rajasingh | ముఖం ఎలా చూపెడతారు..
ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్ర అధికారులకు ముఖం ఎలా చూపెడతారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు.‘‘నా జిల్లాను నాశనం చేసి నన్ను బయటికి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు బయటకు వెళ్లారని” రాజాసింగ్ అన్నారు. అంతేగాకుండా కిషన్రెడ్డికి, ఒవైసీకి మధ్య ఒప్పందం వల్లే ఎంఐఎం అభ్యర్థిని నిలపడం లేదా అని ఆయన ప్రశ్నించారు.