Rajasingh | జూబ్లీహిల్స్​లో ఏ పార్టీని గెలిపిస్తారు.. కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై రాజాసింగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasingh | గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ మరోసారి కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ఎద్దేవా చేశారు. రాజాసింగ్​ కొంతకాలంగా కిషన్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ(BJP)కి రాజీనామా చేసినా.. ఆయన కేంద్ర మంత్రిపై మాత్రం విమర్శలు ఆపడం లేదు. తెలంగాణలో బీజేపీ బలపడకపోవడానికి కిషన్​రెడ్డి (Kishan Reddy)కారణమని ఆయన గతంలో ఆరోపించారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయంలో సైతం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajasingh | గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ మరోసారి కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని ఎద్దేవా చేశారు.
రాజాసింగ్​ కొంతకాలంగా కిషన్​రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

బీజేపీ(BJP)కి రాజీనామా చేసినా.. ఆయన కేంద్ర మంత్రిపై మాత్రం విమర్శలు ఆపడం లేదు. తెలంగాణలో బీజేపీ బలపడకపోవడానికి కిషన్​రెడ్డి (Kishan Reddy)కారణమని ఆయన గతంలో ఆరోపించారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు విషయంలో సైతం విమర్శలు చేశారు. తాజాగా జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాజాసింగ్​ తన మాటల తూటలు వదిలారు.

Rajasingh | ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక(Jubilee Hills By Election) త్వరలో జరగనుంది. ఇప్పటికే బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ అభ్యర్థులను ప్రకటించాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం సైతం ప్రారంభించాయి. అయితే బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ప్రచారంలో సైతం వెనకబడిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజాసింగ్(Rajasingh)​ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారని కిషన్​రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయం జూబ్లీహిల్స్ ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా, కాంగ్రెస్‌ని గెలిపిస్తారా అని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుందన్నారు. కిషన్​రెడ్డి గౌరవం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యలు చేశారు.

Rajasingh | ముఖం ఎలా చూపెడతారు..

ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో ఓడిపోతే కేంద్ర అధికారులకు ముఖం ఎలా చూపెడతారని కిషన్​రెడ్డిని ప్రశ్నించారు.‘‘నా జిల్లాను నాశనం చేసి నన్ను బయటికి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు బయటకు వెళ్లారని” రాజాసింగ్ అన్నారు. అంతేగాకుండా కిషన్​రెడ్డికి, ఒవైసీకి మధ్య ఒప్పందం వల్లే ఎంఐఎం అభ్యర్థిని నిలపడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...