Kamareddy | ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల.. భారీగా సొత్తు చోరీ..

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యింది. ఇంట్లో భారీగా సొత్తు చోరీకి గురైంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని సైలాన్ బాబా కాలనీలో (Sailan Baba Colony) మంగళవారం వెలుగుచూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలో నివసించే మహమ్మద్ వహీద్ తన బంధువుల ఇంటికి సిద్దిపేటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డట్టు గుర్తించాడు. దొంగలు తాళాలను పగులగొట్టి 7 తులాల బంగారం, 80 తులాల […]

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయ్యింది. ఇంట్లో భారీగా సొత్తు చోరీకి గురైంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలోని సైలాన్ బాబా కాలనీలో (Sailan Baba Colony) మంగళవారం వెలుగుచూసింది.

బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలో నివసించే మహమ్మద్ వహీద్ తన బంధువుల ఇంటికి సిద్దిపేటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డట్టు గుర్తించాడు. దొంగలు తాళాలను పగులగొట్టి 7 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

Kamareddy | క్లూస్​ టీం రాక..

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్​టీం సిబ్బంది వేలిముద్రలను సేకరించారు. బాధితుడు వహీద్ మాట్లాడుతూ.. తమ బంధువుల ఊరైన సిద్దిపేటకు (Siddipet) వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు తమ ఇంటి తాళాలను పగులగొట్టారన్నారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్​ను ఓపెన్ చేసి వెళ్లారని బాధితుడు వాపోయాడు. బీరువాలో దాచిన బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్​టీం సిబ్బందితో వేలిముద్రలను సేకరించి కాలనీలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి (CI Narahari) తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...