HomeజాతీయంWeather Updates | బలహీనపడుతున్న వాయుగుండం.. రాష్ట్రానికి వర్ష సూచన

Weather Updates | బలహీనపడుతున్న వాయుగుండం.. రాష్ట్రానికి వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్​ బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది మరింత బలహీన పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్​ (Cyclone Ditwah) బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది మరింత బలహీన పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నైరుతి బంగాళాఖాతంలో ఇటీవల దిత్వా తుపాన్​ ఏర్పడిన విషయం తెలిసిందే.

దీని ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu), ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇది బలహీన పడటంతో ముప్పు తప్పింది. అయితే రానున్న రెండు రోజులు ఆంధ్ర ప్రదేశ్​ (Andhra Pradesh)లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాయుగుండం ఎఫెక్ట్​తో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తా పోర్టుల్లో మూడో నెంబర్‌ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తాలోని పోర్టుల్లో ఒకటో నెంబర్‌ హెచ్చరిక కొనసాగుతోంది.

Weather Updates | తెలంగాణలో..

తెలంగాణ (Telangana)లో పలు జిల్లాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఈ నెల 6, 7 తేదీల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. డిసెంబర్​ 9 తర్వాత చలి తీవ్రత పెరగనుంది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కాగా దిత్వా తుపాన్​ కారణంగా శ్రీలంకలో ఎంతో మంది చనిపోయారు. వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ తుపాన్​ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Must Read
Related News