Municipal Elections | మహారాష్ట్ర కార్పొరేషన్ మాదిరిగానే ఇందూరులోనూ గెలుస్తాం

అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిందని.. అదే స్ఫూర్తితో ఇందూరులోనూ విజయ సాధిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్​లో శుక్రవారం మహారాష్ట్ర కార్పొరేషన్​ ఎన్నికల్లో (Maharashtra Corporation elections) విజయం సాధించిన నేపథ్యంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. Municipal Elections | 29 కార్పొరేషన్లకు గాను.. 26 బీజేపీ మహాయుతి.. […]

అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిందని.. అదే స్ఫూర్తితో ఇందూరులోనూ విజయ సాధిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్​లో శుక్రవారం మహారాష్ట్ర కార్పొరేషన్​ ఎన్నికల్లో (Maharashtra Corporation elections) విజయం సాధించిన నేపథ్యంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Municipal Elections | 29 కార్పొరేషన్లకు గాను.. 26 బీజేపీ మహాయుతి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మొత్తం 29 కార్పొరేషన్లకు గాను 26 బీజేపీ మహాయుతి కూటమి గెలుపొందిందన్నారు. హిందువులంతా ఏకమై ఘన విజయాన్ని అందించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే మైనారిటీ అని.. మైనారిటీలు అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ప్రజలు గ్రహించారన్నారు. అప్పటినుంచి హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. నిజామాబాద్​లో బీజేపీ గెలుపు ఖాయమని, ఇందూరుగా పేరు మార్చడం కూడా ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్యదర్శి జ్యోతి, ఆయా మండలాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...