BJP Nizamabad | హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

అక్షర టుడే, ఇందూరు : BJP Nizamabad | హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిఖిల్ సాయి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. హిందూ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం […]

అక్షర టుడే, ఇందూరు : BJP Nizamabad | హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిఖిల్ సాయి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. హిందూ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటన్నాడు. రేవంత్ రెడ్డి కూడా హిందూమతంలోనే ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక మతం కోసం పని చేస్తూ.. ఇతర మతాలను కించపర్చడం అలవాటైందన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) గెలుపొందగానే కళ్లు నెత్తికెక్కాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కేసీఆర్ హిందు గాళ్లు.. బొందుగాళ్లు అంటూ వ్యాఖ్యలు చేస్తే.. ప్రస్తుతం ఏమైందో అందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...