Naxalism | నక్సలిజాన్ని సామాజిక కోణంలో చూస్తాం : సీఎం రేవంత్​

అక్షరటుడే, హైదరాబాద్: Naxalism : మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని కోరింది. కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్, ప్రొ. అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రిని ప్రతినిధులు కోరారు. ప్రజా […]

అక్షరటుడే, హైదరాబాద్: Naxalism : మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని కోరింది. కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్, ప్రొ. అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు.

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, కాల్పుల విరమణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రిని ప్రతినిధులు కోరారు. ప్రజా ప్రభుత్వం నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో మాత్రమే చూస్తోందని, శాంతి భద్రతల అంశంగా పరిగణించదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.

గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డి కి ఉందని, ఈ విషయంలో మంత్రులతో పాటు జానారెడ్డి సలహాలు, సూచనలను తీసుకుంటామని సీఎం తెలిపారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...