Maoist Party | ఆయుధాలు వీడుతాం.. మావోయిస్టుల సంచలన ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Party | మావోయిస్టులు మరో సంచలన ప్రకటన చేశారు. తాము వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలు వీడుతామని ప్రకటించారు. ఈ మేరకు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు. కొంతకాలంగా మావోయిస్టు పార్టీ బలహీనంగా మారింది. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) దెబ్బకు చాలా మంది నక్సల్స్​ ఎన్​కౌంటర్లలో చనిపోయారు. కీలక నేతలు సైతం హతం అయ్యారు. మరోవైపు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Party | మావోయిస్టులు మరో సంచలన ప్రకటన చేశారు. తాము వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలు వీడుతామని ప్రకటించారు. ఈ మేరకు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు.

కొంతకాలంగా మావోయిస్టు పార్టీ బలహీనంగా మారింది. ఆపరేషన్​ కగార్​ (Operation Kagar) దెబ్బకు చాలా మంది నక్సల్స్​ ఎన్​కౌంటర్లలో చనిపోయారు. కీలక నేతలు సైతం హతం అయ్యారు. మరోవైపు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పలువురు మావోలు లొంగుబాట పట్టారు. ఇటీవల లొంగిపోయే మావోయిస్టుల సంఖ్య పెరిగింది. మరోవైపు కీలక నేత హిడ్మా (Hidma) సహా టెక్​ శంకర్​ మృతితో ఆ పార్టీకి పెద్ద తగిలింది. దీంతో తాము ఆయుధాలు వీడటానికి కొంత సమయం ఇవ్వాలని ఇటీవల మావోయిస్టులు లేఖ రాశారు. తాజాగా లొంగిపోయే తేదీని సైతం ప్రకటించడం గమనార్హం.

Maoist Party | అందరం కలిసి..

ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ పోలీసుల ఎదుట మావోయిస్టులు నిత్యం లొంగిపోతున్నారు. ఆపరేషన్​ కగార్​తో బలగాలు అడవుల్లోకి చొచ్చుకువస్తుండటంతో మావోలకు షెల్టర్​ జోన్లు కరువయ్యాయి. ఒకప్పుడు నక్సల్స్​కు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను సైతం బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో పాటు పోలీసులు, ప్రభుత్వాలు లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో నిత్యం చాలా మంది సరెండర్​ అవుతున్నారు. దీంతో ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు, అందరూ కలిసి లొంగిపోతామని తాజాగా మావోయిస్టులు (Maoists) లేఖలో పేర్కొన్నారు. తమకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తామని తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...