Global Summit | తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతాం : ఎరిక్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Global Summit | తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​ ఉత్సాహంగా సాగుతోంది. గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ (Governor Jishnu Dev Verma) ఈ సదస్సును ప్రారంభించారు. వేలాది మంది అతిథులు హాజరయ్యారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. సదస్సులో గవర్నర్​ మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. మంత్రి శ్రీధర్​ బాబు మాట్లాడారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Global Summit | తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్​ ఉత్సాహంగా సాగుతోంది. గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ (Governor Jishnu Dev Verma) ఈ సదస్సును ప్రారంభించారు. వేలాది మంది అతిథులు హాజరయ్యారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది.

సదస్సులో గవర్నర్​ మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. మంత్రి శ్రీధర్​ బాబు మాట్లాడారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్​ సత్యార్థి మాట్లాడుతూ సీఎం రేవంత్ పాలనపై ప్రశంసలు కురిపించారు. అమెరికాకు చెందిన ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. రాబోయే 10 సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీ, తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడతామన్నారు.

పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ అని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ మైల్ స్టోన్​గా నిలుస్తుందన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పెస్, పరిశ్రమల రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని వెల్లడించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్​ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2047 వరకు వికసిత్​ భారత్​ లక్ష్యంగా పని చేస్తోందన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తేనే ఇది సాధ్యమన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...