Bodhan Municipality | జిల్లాలో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తాం

అక్షరటుడే, బోధన్​: Bodhan Municipality | జిల్లాలో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (Balkonda MLA Prashanth Reddy) అన్నారు. బోధన్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల (Municipal Election) సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. Bodhan Municipality | ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్​.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించాల్సిన సమయం వచ్చిందని ప్రశాంత్​రెడ్డి […]

అక్షరటుడే, బోధన్​: Bodhan Municipality | జిల్లాలో అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (Balkonda MLA Prashanth Reddy) అన్నారు. బోధన్ పట్టణంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల (Municipal Election) సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Bodhan Municipality | ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన కాంగ్రెస్​..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గద్దెదించాల్సిన సమయం వచ్చిందని ప్రశాంత్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఓట్లు అడుగుతూ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణ ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్​ను ఎవరూ వేరు చేయలేరన్నారు. అన్ని మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగరేలా పార్టీ కార్యకర్తలు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...