Jagruthi Nizamabad | ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అనుచరుల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: తెలంగాణ జాగృతి

అక్షరటుడే, ఇందూరు: Jagruthi Nizamabad | ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అనుచరుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ జాగృతి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నగరంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు నీళ్లివ్వాలనే కృత నిశ్చయంతో తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) నిర్మాణ ఎస్టిమేషన్​ నాలుగేళ్లలో ఎందుకు రెట్టింపు అయ్యిందో బీఆర్​ఎస్​ నాయకులు చెప్పాలని సవాల్​ విసిరారు. […]

అక్షరటుడే, ఇందూరు: Jagruthi Nizamabad | ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLA Prashanth Reddy) అనుచరుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ జాగృతి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవీన్​ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన నగరంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు నీళ్లివ్వాలనే కృత నిశ్చయంతో తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) నిర్మాణ ఎస్టిమేషన్​ నాలుగేళ్లలో ఎందుకు రెట్టింపు అయ్యిందో బీఆర్​ఎస్​ నాయకులు చెప్పాలని సవాల్​ విసిరారు. ఈ కుట్ర వెనక ఉన్నది బాల్కొండ ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మించడంలో కేసీఆర్​ను కవిత ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత కూడా పనులు పూర్తికాక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు (Nizamabad and Kamareddy districts) సాగునీరు రాలేదన్న రైతుల ఆవేదనను మాత్రమే ఎత్తి చూపించామని వారు స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ నీటినే ప్యాకేజీ 20 ద్వారా తరలించి ప్యాకేజీ–21 పైపులైన్​ ద్వారా కప్పలవాగులోకి ఒకే ఒక్కరోజు ఎత్తిపోశారన్నారు.

దీంట్లో ఎంతవరకు సాగులోకి వచ్చిందనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్నారు. నిజామాబాద్ తెలంగాణ జాగృతి ప్రతినిధి అవంతి కుమార్ మాట్లాడుతూ.. వరద కాలువలపై నిర్మించిన పంప్​హౌజ్​లలో జరిగిన అవినితీ రాష్ట్రమంతా తెలుసన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఏ ఒక్క ఎకరానికి కూడా నీరు రాలేదని కవిత పేర్కొన్నారని ఆ మాటలకు తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందన్నారు. బోధన్ నియోజకవర్గ తెలంగాణ జాగృతి నాయకులు ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ.. ప్రశాంత్‌ రెడ్డికి ఎంపీ అర్వింద్​కు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో బహిర్గతం చేయాలన్నారు.  బాల్కొండలో ఇసుక దందా ఎవరు చేశారో బీఆర్​ఎస్​ నాయకులే చెప్పాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి నాయకులు కరిపె రాజు, మీసాల శంకర్, అంబటి శ్రీనివాస్, శేఖర్ రాజ్, యెండల ప్రసాద్, జనార్దన్, సాయికృష్ణ, ఆజాం, షానవాజ్​, హరీష్, సందీప్, ఆకాష్, వంశీ, జాగృతి మహిళా నాయకులు శోభ, సరిత, రేఖ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...