Virat Kohli | విరాట్ కోహ్లీ ఆర్‌సీబీకి గుడ్‌బై చెప్పనున్నాడా? మహ్మద్ కైఫ్ వీడియోతో క్లారిటీ !

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) RCB తరఫున ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో మెరిసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు టీంకి గుడ్ బై చెప్ప‌నున్నాడ‌నే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలపై టీమిండియా (Team India)మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పష్టతనిచ్చాడు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) RCB తరఫున ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో మెరిసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు టీంకి గుడ్ బై చెప్ప‌నున్నాడ‌నే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలపై టీమిండియా (Team India)మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పష్టతనిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన వీడియోలో కైఫ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ (Virat Kohli)ఎక్కడికీ వెళ్లడంలేదు. అతను బెంగళూరు జ‌ట్టుకి అంకితభావంతో ఆడతాడు. తన మొదటి, చివరి మ్యాచ్‌ను ఆర్‌సీబీ తరఫునే ఆడుతానని అతను ఇప్పటికే చెప్పాడు. ఆ మాట తప్పడు” అని తెలిపారు.

Virat Kohli | అస‌లు క్లారిటీ ఇదే..

అయితే, కోహ్లీ కమర్షియల్ ఒప్పందంపై సంతకం చేయకపోవడానికి వెనుక కారణం ఉందని కైఫ్ (Mohammed Kaif) వెల్లడించాడు.“ఒక్కో ఫ్రాంచైజీకి ఆటగాళ్లు రెండు రకాల కాంట్రాక్టులు సైన్ చేస్తారు. ఒకటి ప్లేయర్ కాంట్రాక్ట్, మరొకటి కమర్షియల్ డీల్. ఆర్‌సీబీ యాజమాన్యంలో మార్పులు జరగవచ్చనే సమాచారం ఉంది. కొత్త యజమానులు వస్తే కమర్షియల్ ఒప్పందాల షరతులు మారవచ్చు. అందుకే కోహ్లీ ప్రస్తుతం వేచి చూస్తున్నాడు. ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే” అని కైఫ్ వివరించాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ ఫామ్ పీక్‌లో ఉందని ఆయన గుర్తు చేశాడు.

వన్డే ప్రపంచకప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో 650కి పైగా పరుగులు చేసి ఆర్‌సీబీ (RCB)టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతని అసలు ఆట మొదలైంది అని అన్నారు. మొత్తానికి, కోహ్లీ ఆర్‌సీబీని విడిచిపెడతాడన్న వార్తలు నిరాధారమని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కైఫ్ స్పష్టం చేశాడు. “కోహ్లీ ఆర్‌సీబీ కోసమే ఆడతాడు. అభిమానులకు ఇచ్చిన మాట తప్పడు అని కైఫ్ తేల్చి చెప్ప‌డంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...