Tirumala | తిరుమలలో వీఐపీ బ్రేక్​ దర్శనాలు రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజులు, పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. త్వరలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) నేపథ్యంలో పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో డిసెంబర్ 23 నుంచి 2026 జనవరి నెలాఖరు వరకు పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సెలవు రోజులు, పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. త్వరలో వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) నేపథ్యంలో పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో డిసెంబర్ 23 నుంచి 2026 జనవరి నెలాఖరు వరకు పలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 23, డిసెంబర్ 29, నుంచి జనవరి 8, జనవరి 25 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshans) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Tirumala | పర్వదినాల నేపథ్యంలో..

డిసెంబరు 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నారు. దీంతో ఆ రోజు బ్రేక్​ దర్శనాలు నిలిపివేశారు. వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబరు 29 నుంచి జనవరి 8 వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవని అధికారులు తెలిపారు. జనవరి 25వ తేదీన రథసప్తమి ఉంది. దీంతో ఆ రోజున ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా రోజుల్లో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...