Vijaywada | విజయవాడ దుర్గగుడిలో పూజ‌కి ఉప‌యోగించిన పాల‌ల్లో పురుగులు.. విచార‌ణ‌కు ఆదేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijaywada | విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గమ్మ ఆలయంలో (Sri Durgamma Temple) చోటు చేసుకున్న ఘటన భక్తుల్లో ఆందోళనకు కారణమైంది. ఆలయంలో నిర్వహించే శ్రీచక్ర నవావరణార్చన పూజ సమయంలో వినియోగించిన పాలల్లో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన ఆలయ యాజమాన్యం వెంటనే చర్యలకు దిగింది. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజలో ఈ విషయం బయటపడడంతో, పూజా కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం ఘటనపై సమగ్ర విచారణ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijaywada | విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గమ్మ ఆలయంలో (Sri Durgamma Temple) చోటు చేసుకున్న ఘటన భక్తుల్లో ఆందోళనకు కారణమైంది. ఆలయంలో నిర్వహించే శ్రీచక్ర నవావరణార్చన పూజ సమయంలో వినియోగించిన పాలల్లో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది.

ఈ సంఘటనతో అప్రమత్తమైన ఆలయ యాజమాన్యం వెంటనే చర్యలకు దిగింది. శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజలో ఈ విషయం బయటపడడంతో, పూజా కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించారు. దేవస్థాన స్థానాచార్యుల పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ (Assistant Commissioner), ఏఈవోలు, సూపరింటెండ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆలయ అర్చకులు, స్టోర్‌ విభాగం, పూజా విభాగం సిబ్బందిని విచారించి వివరాలు సేకరించింది.

 Vijaywada | అప‌చారం..

విచారణలో అభిషేకానికి ఉపయోగించిన పాత్ర పరిశుభ్రంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు తేలింది. ఆ బిందెలోనే పాలను పోసి పూజ నిర్వహించడంతో సమస్య తలెత్తిందని కమిటీ నిర్ధారించింది. అలాగే సంబంధిత విభాగాల్లోని సిబ్బంది నిర్లక్ష్యం కూడా కారణమని నివేదికలో పేర్కొన్నారు. ఈ అంశంపై బాధ్యత వహించిన అర్చకుడికి ఆలయ అధికారులు మెమో జారీ చేసి, ఆయనను ఇతర సేవల పర్యవేక్షణ బాధ్యతలకు మార్చారు. స్టోర్‌ మరియు పూజా విభాగాల సిబ్బందిని వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సంఘటనపై రూపొందించిన పూర్తి నివేదికను త్వరలోనే దేవాదాయ శాఖ కమిషనర్‌కు (Endowments Department Commissioner) పంపనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.

ఇకపై ఆలయంలో జరిగే పూజలు, అభిషేకాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు వాడుతున్న టెట్రా పాల ప్యాకెట్లను నిలిపివేసి, శుద్ధమైన ఆవు పాలను (Cow Milk) మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు. భక్తుల విశ్వాసానికి భంగం కలగకుండా నాణ్యత, పరిశుభ్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆలయ యాజమాన్యం భరోసా ఇచ్చింది.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...