అక్షరటుడే, ఇందూరు: Vignan High School | నగరంలోని విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ కవిత (Correspondent Kavitha) తెలిపారు. నమిత్ కుమార్ 566 మార్కులు, జ్యోతిర్మయి 547 మార్కులు, అలాగే 22 మంది విద్యార్థులు 500కు పైబడి మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను డైరెక్టర్ సేపూర్ జయసింహ గౌడ్ (Director Sepur Jayasimha Goud) అభినందించారు.