Vigilance raids | రైస్​మిల్లులపై విజిలెన్స్​ దాడులు.. భారీగా ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తింపు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vigilance raids | రాష్ట్రవ్యాప్తంగా రైస్​ మిల్లులపై (rice mills) విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు. భారీగా సీఎంఆర్​ ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 19 రైస్ మిల్లులపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు (Vigilance & Enforcement teams ) సోమ, మంగళవారాల్లో తనిఖీలు చేశాయి. మొత్తం రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 1.90 లక్షల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vigilance raids | రాష్ట్రవ్యాప్తంగా రైస్​ మిల్లులపై (rice mills) విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు చేశారు. భారీగా సీఎంఆర్​ ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తించారు.

రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 19 రైస్ మిల్లులపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు (Vigilance & Enforcement teams ) సోమ, మంగళవారాల్లో తనిఖీలు చేశాయి. మొత్తం రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 1.90 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు ఇతర అవసరాల కోసం తరలించినట్లు పేర్కొన్నారు. 14 మిల్లులు తీవ్రమైన అక్రమాలు, CMR ధాన్యం దారి మళ్లింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

Vigilance raids | ఈ జిల్లాల్లో అధికం

సీఎంఆర్​ అక్రమాలకు పాల్పడిన రైస్​ మిల్లుల్లో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా టాప్​లో ఉండటం గమనార్హం. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో (Nizamabad district) రూ.19.73 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేటలో రూ.19.32 కోట్లు, నారాయణపేటలో రూ.15.91 కోట్లు, పెద్దపల్లిలో రూ.11.38 కోట్లు, మహబూబాబాద్ రూ.4.86 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్లు దుర్వినియోగం చేశారు. వారిపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఆయా రైస్​మిల్లుల లైసెన్స్​ రద్దు కోసం సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.

Vigilance raids | యేటా ఇదే తంతు

రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్​లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్​ చేయడం కోసం రైస్​ మిల్లులకు కేటాయిస్తోంది. ఒక క్వింటాల్​ ధాన్యానికి మిల్లులు 67 కిలోల బియ్యం (సీఎంఆర్​) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా మిల్లులు ధాన్యం తీసుకున్నా.. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడం లేదు. కొన్ని మిల్లులు కేటాయించిన ధాన్యం కంటే తక్కువ బియ్యం ఇస్తున్నాయి. యేటా చాలా వరకు మిల్లులు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజిలెన్స్​ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...