Pothangal | నష్టపరిహారం కోసం టవర్​ ఎక్కిన బాధితుడు

అక్షరటుడే, కోటగిరి : Pothangal | గత వర్షాకాలంలో గోడకూలిన ఘటనలో తనకు నష్టపరిహారం అందకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్​ టవర్​ ఎక్కాడు. ఈ ఘటన కోటగిరి మండలం (Kotagiri Mandal) పోతంగల్​ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్ గ్రామంలో ఇoదురు సాయిలు తన భార్యపిల్లలతో నివాసముండేవాడు. అయితే గత వర్షాకాలంలో భారీ వర్షానికి ఇంటిపక్కన ఉన్న గోడకూలి తన భార్య, కూతురు మృతి చెందారు. […]

అక్షరటుడే, కోటగిరి : Pothangal | గత వర్షాకాలంలో గోడకూలిన ఘటనలో తనకు నష్టపరిహారం అందకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్​ టవర్​ ఎక్కాడు. ఈ ఘటన కోటగిరి మండలం (Kotagiri Mandal) పోతంగల్​ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్ గ్రామంలో ఇoదురు సాయిలు తన భార్యపిల్లలతో నివాసముండేవాడు. అయితే గత వర్షాకాలంలో భారీ వర్షానికి ఇంటిపక్కన ఉన్న గోడకూలి తన భార్య, కూతురు మృతి చెందారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

ఆ సమయంలో ఇంటిపక్క వారు సాయిలుకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన సాయిలు సోమవారం ఉదయం గ్రామ శివారులోని ఎలక్ట్రికల్​ టవర్​ (Electrical Tower) ఎక్కి విద్యుత్​ వైర్లు పట్టుకుని చనిపోతానని భీష్మించుకు కూర్చున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే ఎస్సై సునీల్​ (SI Sunil)కు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అతడి కుల పెద్ద మనుషులతో మాట్లాడించారు. న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి సాయిలును కిందికి దించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...