Mahabubnagar | కోటిన్నర కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ.. ద‌ర్శించుకునేందుకు పోటెత్తిన భ‌క్తులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubnagar | మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లోని ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం(Sri Vasavi Kanyaka Parameshwari Temple) దసరా సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ఆలయంలో రూ.1.25 కోట్ల విలువైన నూతన కరెన్సీ నోట్లతో తయారు చేసిన మాలలతో అమ్మవారిని విశిష్టంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ వైభవోపేత అలంకరణను నిర్వహించారు. అమ్మవారిని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubnagar | మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లోని ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం(Sri Vasavi Kanyaka Parameshwari Temple) దసరా సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఏడాది ఆలయంలో రూ.1.25 కోట్ల విలువైన నూతన కరెన్సీ నోట్లతో తయారు చేసిన మాలలతో అమ్మవారిని విశిష్టంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ వైభవోపేత అలంకరణను నిర్వహించారు. అమ్మవారిని ద్రవ్య మాలలతో అలంకరించిన దృశ్యం చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు

Mahabubnagar | ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌..

కేవలం కొల్లాపూర్(Kollapur) నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. దసరా మహోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజూ ఒక ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం(Arya Vaishya Sangham) ప్రతినిధులు, స్థానికులు కలిసి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాల్లో భాగంగా సంప్రదాయం మరియు ఆధునికతకు మేళవింపుగా అమ్మవారిని అలంకరిస్తున్నారు.

ఈ ప్రత్యేక కరెన్సీ అలంకరణ ఆలయాన్ని కొత్త శోభను కలిగించడంతో పాటు దసరా ఉత్సవాలకు మరింత మహిమను చేకూర్చింది. భక్తుల సద్వినియోగం కోసం ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల‌లో న‌వ‌రాత్రి ఉత్స‌వాలు క‌నుల‌పండుగ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క‌రు కూడా భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో అమ్మ‌వారిని కొలుస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...