అక్షర టుడే, ఇందూరు: Mla Dhanpal | నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) బుధవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారివురు కాసేపు చర్చించారు. నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, ప్రభాకర్, ఆనంద్, పవన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
