Homeజిల్లాలుహైదరాబాద్Kalvakuntla Kavitha | ఉప్పల్​ ఫ్లైఓవర్​ నిర్మాణం పూర్తి చేయాలి : కవిత

Kalvakuntla Kavitha | ఉప్పల్​ ఫ్లైఓవర్​ నిర్మాణం పూర్తి చేయాలి : కవిత

ఉప్పల్​ ఫ్లై ఓవర్​ పనులను జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalvakuntla Kavitha | హైదరాబాద్​ నగరంలో (Hyderabad city) అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉప్పల్​ ఒకటి. ఇక్కడ ఫ్లై ఓవర్​ నిర్మాణం ఏళ్లుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లై ఓవర్​ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్​ చేశారు.

జాగృతి జనంబాట కార్యక్రమంలో (Jagruti Janambata program) భాగంగా రామంతాపూర్​లోని ఇందిరానగర్​లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి కవిత నివాళి అర్పించారు. అనంతరం ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులను (Uppal flyover work) పరిశీలించారు. పనుల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఉప్పల్ ఫ్లై ఓవ ను 8 ఏళ్లుగా కడుతూనే ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Kalvakuntla Kavitha | హామీ ఇచ్చారు..

ఫ్లై ఓవర్​ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే.. మంత్రి కోమటి రెడ్డి (Minister Komati Reddy) స్పందించారన్నారు. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఉందని విమర్శించారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవటానికి తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఘట్కేసర్ వరకు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఆలస్యమవుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలని డిమాండ్​ చేశారు.

Must Read
Related News