Minister Kishan Reddy | సీఎం రేవంత్​ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Minister Kishan Reddy | పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) చేపట్టి పాకిస్తాన్​కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. కాగా.. సీజ్​ ఫైర్​పై సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (prime minister narendra modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (US president trump) ఒత్తిడికి భయపడి లొంగిపోయారంటూ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Minister Kishan Reddy | పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత భారత్​ ఆపరేషన్​ సిందూర్​ (operation sindoor) చేపట్టి పాకిస్తాన్​కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. అనంతరం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. కాగా.. సీజ్​ ఫైర్​పై సీఎం రేవంత్​రెడ్డి (CM revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (prime minister narendra modi) అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ (US president trump) ఒత్తిడికి భయపడి లొంగిపోయారంటూ వ్యాఖ్యానించారు. ఆపరేషన్​ సిందూర్​ అనంతరం ట్రంప్​ భయపెట్టడంతో మోదీ కాల్పుల విరమణకు అంగీకరించారంటూ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం (central governament) పాకిస్తాన్​ను చిత్తు చేసే అవకాశాన్ని వదులుకుని వెనకడుగు వేసిందంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

Minister Kishan Reddy | కిషన్​ రెడ్డి ఫైర్​

కాగా.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Union Minister Kishan Reddy) ఫైర్​ అయ్యారు. ‘పాకిస్థాన్‌పై అపరేషన్ సిందూర్‌ ద్వారా భారత సైన్యం (Indian Army) విజయం సాధించింది. కానీ ఈ విజయాన్ని తక్కువ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ (congress party) దివాలా కోరుతనానికి నిదర్శనం. భారత సైన్యం దెబ్బకు కంగుతిన్న పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. కానీ.. యుద్ధం ఆపారని సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గం. భారత సైన్యం (indian army) ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ మాట్లాడిన సీఎం రేవంత్, కాంగ్రెస్ అధినాయకత్వం సైన్యానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’ అని కిషన్​ రెడ్డి (kishan reddy) డిమాండ్ చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...